ఎన్టీఆర్ జిల్లా మైలవరం వాసుదేవానంద నగర్ లో ఉన్న శ్రీ దండాయుధపాణి శ్రీ వాసుదేవానంద స్వామి నిత్య అన్నదాన వేద విద్య మందిరంలో మహా యజ్ఞం జరగనుంది. నేటి నుండి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న చండీ సహిత అతి రుద్ర మహా యజ్ఞాన్ని కన్నుల పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 200 మంది రుత్వికులు ఆధ్వర్యంలో వాసమ్మ పర్యవేక్షణలో జరగనున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.