రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూజిత అక్షింతల కలశ వితరణ మహోత్సవాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర యోగి హాజరైనారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలను తీసుకువచ్చి ప్రతీ ఇంటింటికి పంపించే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించి శ్రీరామునీ రాజ్య పరిపాలన, ఆయన గొప్ప తనం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించి డిసెంబర్ వరకు హనుమాన్ దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలిసను పఠించి జనవరి 1 తరువాత ప్రతి గడపగడపకు అందించాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాస్కరా యోగీ, బీజేపి నాయకులు, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.
Devotional
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు, రాముని చిత్రపటం, కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి పంచుతున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లా అంతటా శ్రీరామచంద్ర స్వామి వారి అక్షితలు, చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అక్కిరెడ్డి అన్నారు. జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు, కళ్యాణాలు, హోమాలు, క్రతువులు నిర్వహించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. అదేవిధంగా 22వ తేదీ సాయంత్రం ప్రతి ఇంటి వద్ద కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతోందని అక్కిరెడ్డి సుబ్రమణ్యం తెలిపారు.
Read Also..
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతూ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది. సెలవు సోమవారం కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి పై ఉన్న క్యూలైన్ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి గంటలు పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో మేడారం గద్దెల ప్రాంగణంలో భక్తులు భారీగా తరలి వచ్చి సందడి చేశారు. మహా జాతర సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రల ప్రజలే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ చీరసారే నిలువెత్తు బంగారం మొక్కులు సమర్పించుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ కూడా జాతరపై చాలానే ఉంది. కరోనా భయంతో భక్తులు ముందుగానే తండోవతండాలు వస్తున్నారు. మేడారం పరిసరాలు మొత్తం భక్తులతో కిక్కిరిసింది. అకస్తాత్తుగా భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏర్పాట్లు చెయ్యలేక తలలు పట్టుకుంటున్నారు.
Read Also..
Read Also..
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈ నెల 26వ తేది అర్ధరాత్రి జరగనున్నది. ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది. కావున స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దేవరకద్ర బస్టాండ్ నుండి ఆర్టిసి బస్సులను, దర్శనం కోసం క్యూలైన్లు, స్నానపు ఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిజేశారు. రాజమూరు ఆంజనేయ స్వామిని ఇంటికి ఇలా వేల్పుగా భక్తులు భావిస్తారు. ఈ దేవాలయం కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు చింతచెట్టు కింద ప్రత్యక్షంగా వెలిశారు. భక్తులు మనసులో కోరికలు అనుకొని ఈ చింత చెట్టుకు ముడుపులు కడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడం ప్రత్యేకత.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం శ్రీరాముని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దేశమంతటా అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు, అయోధ్య రామ మందిరం యొక్క రాముడు చిత్రపటం, కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి చేరే విధంగా పంచనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈరోజు పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సమావేశమై కోనసీమ జిల్లా అంతా శ్రీరామ చంద్ర స్వామి వారి అక్షింతలు, చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు, కళ్యాణాలు, హోమాలు, క్రతువులు చేయమని చెప్పడం జరుగుతుందని అదేవిధంగా ఆరోజు సాయంత్రం దేశంలో ఉన్న ప్రతి ఇంటి వద్ద తక్కువలో తక్కువగా కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతుందని అన్నారు. ఆ విధంగా జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి వద్ద దీపాలను వెలిగించి 500 ఏళ్ల తర్వాత ప్రతి ఇంటి వద్ద ఆనందం వెళ్లి విరిసి మన హిందువుల కలలను సహకారం చేసుకోవాలని అన్నారు.
శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి నవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓడి చెరువు మండలం ఎం కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభోగంగా, ఎంతో భక్తిశ్రద్ధలతో, స్వామి వారి రథోత్సవాన్ని అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ఊరేగించారు. రాష్ట్రంలో శ్రీ మణికంఠ స్వామి రథోత్సవం ఎక్కడ లేకపోవడం విశేషం కాగా.. ఓడి చెరువు మండలంలో గత ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ఊరేగింపుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఎం కొత్తపల్లి బండపై నుంచి స్వామివారి రథోత్సవాన్ని వేలాదిమంది అయ్యప్ప స్వామి భక్తులు ఓడి చెరువు పురవీధుల్లో అత్యంత వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించారు. శ్రీ మణికంఠుడు, వేలాయుధుడు, అయిన స్వామి వారు, స్వామికి అత్యంత ఇష్టమైన పులి వాహనంపై ఆశీనులు కాగా వేలాదిమంది అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు పారవశ్యంతో.. స్వామివారి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. పురవీధులలో ఎక్కడ చూసినా అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమోగాయి. ముఖ్యంగా మహిళలు, పురవీధులలో ప్రధాన రహదారులపై స్వామివారి రథం ముందు పవిత్ర గంగ నీరు పోసి రథాన్ని లాగడానికి సహకరించారు. ఓడి చెరువు మండలంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఎం కొత్తపల్లి నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు స్వామివారి రథాన్ని లాగుతూ అయ్యప్ప స్వామి భక్తులు పులకరించి పోయారు. స్వామివారికి నైవేద్యంగా చక్ర పొంగలి, టెంకాయలు పూలు సమర్పించుకుని మహిళా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గురు స్వామి అయిన పచ్చర్ల ఆంజనేయులు నాయుడు ఈ ఏడు పంటలు బాగా పండి సకాలంలో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందజేశారు.
Read Also..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు, స్వామి వారి లిప్తపాటు దర్శనం తో జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు. విశేష పర్వదినాలలో స్వామివారిని చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల కు భక్తులు విశేషంగా వచ్చారు స్వామి వారి దర్శనం తో పాటు ఆలయంలోనూ వెలుపల ప్రత్యేక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులు చేశాయి. ఉద్యానవన విభాగం ఏర్పాటుచేసిన నమూనా ఆలయం అందరిని తన్మయత్వానికి గురిచేశాయి. శ్రీవారి ఆలయం మరియు ఆలయం వెలుపల పుష్పాలంకరణ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ పర్యాయం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో అద్భుతమైన అలంకరణలను చేశారు. ముఖ్యంగా ఆలయం లోపల పుష్పాలతో ఏర్పాటు చేసిన దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. మరోవైపు స్వామివారిని దర్శించుకొలేని భక్తుల కోసం ఆలయం వెలుపల శ్రీరంగం శ్రీ రంగనాధ స్వామిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణాలో మిని శ్రీశైలంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే ముక్కొటిగా ఆయురారోగ్యాలను ప్రసాదించే భోళా శంకరుడిగా. సంతానాన్ని నెరవేర్చే సంతానేశ్వరుడిగా పేరుగాంచాడు. చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి జాతర అద్భుతంగా జరుగుతాయి. ఐదు రోజుల పాటు సాగి జాతరను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి కిలో మీటర్ దూరంలో చెర్వుగట్టుపై పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకోవడం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు. స్వామివారు కొండ గుహలో భక్తవత్సలుడుగా కొలువై ఉంటాడు. అందుకే భక్తులు గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తప్పనిసరిగా క్షీరాభిషేకం చేస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చే భోళా శంకరుడిగా, సంతానం ప్రసాదించే సంతానేశ్వరుడిగా పేరుగాంచిన ఆ ముక్కోటి ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కామధేనువు విషయంలో తండ్రి జమదగ్ని మహర్షిని అదును చూసి చంపిన కర్త్యా వీరార్జునుడిని సంహరించిన తర్వాత పరశ రాముడు పాప ప్రక్షాళన కోసం దేశమంతా 108 శివలింగాలను ప్రతిష్టించారు. అలా ప్రతిష్టించిన ఆ 108 వ లింగమే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరుడి ఆలయమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి మహాపర్వదినం రోజున ఇక్కడకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. శివమాలలు వేస్తారు. లింగ ప్రతిష్టాపనలో భాగంగా పరశురాముడు వేల సంత్సరాలు తపస్సు చేస్తాడు. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై లింగం మీద గొడ్డలితో ఒక దెబ్బ వేస్తాడు. భక్తుడి కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడని అనంతరం పరుశురాముడు అక్కడే శివైక్యం చెందాడని పురాణాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లాలో కొలువైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. క్షత్రియ సంహారం అనంతరం పాప ప్రక్షాళన కోసం పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాలలోచివరి లింగమని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానం నిత్యాన్నదాత అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పాస్టర్లు హాజరై క్రీస్తు జన్మ వృత్తాంతంపై సందేశమిచ్చారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాస్టర్ ఎలీషా సేవా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈభూమి ఉన్నంత వరకు షా బుఖారి బాబా ఆస్థానంలో నిత్య అన్నదానం కొనసాగాలని, నిత్యం కనీసం ఐదు వేల మందికి అన్నదానం చేసేలా ప్రార్థించాలని కోరారు. అనంతరం పాస్టర్లను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.