Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Devotional కోరికలు నెరవేర్చే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా..!

కోరికలు నెరవేర్చే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా..!

by Satya
Parvati Jadala Ramalingeswara Swamy Temple

పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణాలో మిని శ్రీశైలంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే ముక్కొటిగా ఆయురారోగ్యాలను ప్రసాదించే భోళా శంకరుడిగా. సంతానాన్ని నెరవేర్చే సంతానేశ్వరుడిగా పేరుగాంచాడు. చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి జాతర అద్భుతంగా జరుగుతాయి. ఐదు రోజుల పాటు సాగి జాతరను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి కిలో మీటర్ దూరంలో చెర్వుగట్టుపై పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకోవడం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు. స్వామివారు కొండ గుహలో భక్తవత్సలుడుగా కొలువై ఉంటాడు. అందుకే భక్తులు గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తప్పనిసరిగా క్షీరాభిషేకం చేస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చే భోళా శంకరుడిగా, సంతానం ప్రసాదించే సంతానేశ్వరుడిగా పేరుగాంచిన ఆ ముక్కోటి ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కామధేనువు విషయంలో తండ్రి జమదగ్ని మహర్షిని అదును చూసి చంపిన కర్త్యా వీరార్జునుడిని సంహరించిన తర్వాత పరశ రాముడు పాప ప్రక్షాళన కోసం దేశమంతా 108 శివలింగాలను ప్రతిష్టించారు. అలా ప్రతిష్టించిన ఆ 108 వ లింగమే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరుడి ఆలయమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి మహాపర్వదినం రోజున ఇక్కడకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. శివమాలలు వేస్తారు. లింగ ప్రతిష్టాపనలో భాగంగా పరశురాముడు వేల సంత్సరాలు తపస్సు చేస్తాడు. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై లింగం మీద గొడ్డలితో ఒక దెబ్బ వేస్తాడు. భక్తుడి కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడని అనంతరం పరుశురాముడు అక్కడే శివైక్యం చెందాడని పురాణాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లాలో కొలువైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. క్షత్రియ సంహారం అనంతరం పాప ప్రక్షాళన కోసం పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాలలోచివరి లింగమని పురాణాలు చెబుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

039239
Total views : 194923

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: