106
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 28 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ద్వారా రూ.2 కోట్ల 78 లక్షల 13 వేల 79 నగదు ఆలయానికి సమకూరినట్లు ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. అదనంగా 708 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 150 గ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు తెలిపారు. కొండక్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.



Total views : 203017