హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్ లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ సభ్యులు, వివిధ సంస్థలు భక్తులకు ఆత్మీయ ఆతిథ్యంతో స్వాగతం పలికాయి. అంతకుముందు, జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ వార్షిక యాత్ర కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. భక్తులను స్వాగతించిన వారిలో డీఐజీ సర్గూన్ శుక్లా, రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ అలియాస్ ఖాన్, ఎస్ఎస్పీ అరుణ్ గుప్తా, ట్రాఫిక్ ఎస్ఎస్పీ రాజా ఆదిల్ హమీద్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. తర్వాత, భక్తులు బస చేసే మొదటి ప్రధాన కేంద్రం చందర్కోట్. పవిత్ర యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. చందర్కోట్ లంగర్ సైట్ వద్ద భక్తులకు అవసరమైన వసతులు, భోజన సదుపాయాలను సిద్ధం చేశారు.
అమర్నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభం.
95




Total views : 202970