మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో మేడారం గద్దెల ప్రాంగణంలో భక్తులు భారీగా తరలి వచ్చి సందడి చేశారు. మహా జాతర సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రల ప్రజలే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ చీరసారే నిలువెత్తు బంగారం మొక్కులు సమర్పించుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ కూడా జాతరపై చాలానే ఉంది. కరోనా భయంతో భక్తులు ముందుగానే తండోవతండాలు వస్తున్నారు. మేడారం పరిసరాలు మొత్తం భక్తులతో కిక్కిరిసింది. అకస్తాత్తుగా భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏర్పాట్లు చెయ్యలేక తలలు పట్టుకుంటున్నారు.