తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి. డిసెంబరు 22న అదే రోజు దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల రద్దు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభం. డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేత. డిసెంబరు 22వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరిన టిటిడి.
Devotional
అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఉలవపాడులో అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ఉలవపాడు మండల వాసులు, రామభక్తులు ఊరేగింపుగా అక్షింతలను మండలంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పంచాయితీ వారి జన సంపర్క్ అభయాన్ ప్రముఖులకు, సహ ప్రముఖులకు అక్షింతలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సహ కార్యదర్శి పర్రే. కోటేశ్వరరావు, జన సంపర్క్ అభయాన్ జిల్లా సహ ప్రముఖులు కోట సురేంద్ర రెడ్డి, ఉలవపాడు మండలం జన సంపర్క్ అభయాన్ ప్రముఖ ఏ సత్యం, సహ ప్రముఖ పి వెంకట్రావు, విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి కోనసం సంజీవరెడ్డి, సత్సంగ ప్రముఖ బి బాలిరెడ్డి అన్ని పంచాయతీల జన సంపర్క్ ప్రముఖులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ తెలుగు సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగ శ్రావణ మాసంలోని అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ పండుగను ఆడపిల్లలు, స్త్రీలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.
బతుకమ్మ పండుగను జరుపుకునే విధానం:
- పువ్వులతో బతుకమ్మను తయారు చేయడం: బతుకమ్మను తయారు చేయడానికి తాజా పువ్వులు, పసుపు, కుంకుమ, ఒత్తులు, పూలమాలలు మరియు ఇతర అలంకరణలు ఉపయోగిస్తారు. బతుకమ్మకు తలపై ఒక పెద్ద పువ్వు ఉంచుతారు. మెడలో పసుపు, కుంకుమతో ఒక గొలుసును వేస్తారు. ఒంటిపై పువ్వుల మాలలు మరియు ఇతర అలంకరణలను కడతారు.
- బతుకమ్మలను పూజించడం: బతుకమ్మలను పూజించడానికి ముందు, వాటిని ఒక పెద్ద కుండలో నీటితో నింపి ఉంచుతారు. పూజ ముగిసిన తర్వాత, ఆ నీటిని పిల్లలకు త్రాగిస్తారు. బతుకమ్మలను పూజించేటప్పుడు, మంగళ హారతి ఇస్తారు. స్త్రీలు బతుకమ్మలకు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పూజిస్తారు.
- బతుకమ్మలను ఊరేగించడం: బతుకమ్మలను పూజించిన తర్వాత, వాటిని ఊరేగిస్తారు. ఊరేగింపులో భాగంగా, బతుకమ్మలను ఒక ఊరేగింపు బండిలో ఉంచి, గ్రామంలోని ప్రతి ఇంటి ముందు ఊరేగిస్తారు. ఊరేగింపులో పాల్గొనే వారు బతుకమ్మలకు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉంటారు.
- బతుకమ్మలను వదిలిపెట్టడం: ఊరేగింపు ముగిసిన తర్వాత, బతుకమ్మలను ఒక చెట్టు కింద వదిలిపెడతారు. ఈ కార్యక్రమాన్ని “బతుకమ్మలను వదిలిపెట్టడం” అంటారు. ఈ కార్యక్రమం ద్వారా, భూమికి బతుకమ్మలు తిరిగి వెళ్లిపోతున్నారని భావిస్తారు.
బతుకమ్మ పండుగ అనేది భూమికి ఋణపూర్ణతను తెలియజేయడానికి జరుపుకునే పండుగ. ఈ పండుగ ద్వారా, భూమిని కాపాడుకోవాలనే భావాన్ని ప్రోత్సహిస్తారు.
రావిచెట్టు ను హిందూ మతంలో పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు. దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. రావిచెట్టును విష్ణువు యొక్క అంశంగా భావిస్తారు. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. దారిద్ర్యం తొలగిపోతుంది, సంతానం లభిస్తుంది, రోగాలు తగ్గుతాయి, శుభాలు కలుగుతాయి. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి, ముందుగా శుభ్రంగా స్నానం చేసి, శుచిగా ఉండాలి. తరువాత, రావిచెట్టుకు ముందుగా నమస్కరించి, దానికి పువ్వులు, పూజాసామాగ్రిలు సమర్పించాలి. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ఎటువైపు నుండి ప్రారంభించాలనేది ముఖ్యం. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ఎల్లప్పుడూ కుడివైపు నుండి ప్రారంభించాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, రావిచెట్టును స్పృశిస్తూ, భగవంతుని గురించి ధ్యానం చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణం తర్వాత, రావిచెట్టుకు నమస్కరించాలి. రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ఉత్తమ సమయం శనివారం. శనివారం రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. ప్రదక్షిణలు చేయడం వల్ల కోరుకున్న ఫలితాలు లభించాలంటే, భక్తిశ్రద్ధతో చేయాలి.
ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము. అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒక శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు.కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదని అంటారు. ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి. శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు. ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.
Read Also..
Read Also..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోదీని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోదీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు.
Read Also..
Read Also..
హనుమాన్ పూజను మంగళవారం చేయడం చాలా శుభప్రదం. ఈ రోజు హనుమాన్కు పూజ చేయడం వల్ల మీరు మీ కోరికలన్నీ నెరవేరతాయి మరియు మీరు కోటీశ్వరులవుతారని నమ్ముతారు.
మంగళవారం హనుమాన్ పూజ ఎలా చేయాలి?
- మంగళవారం ఉదయం ముందుగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించండి.
- హనుమాన్ విగ్రహం లేదా ఫోటోను మీ ఇంటి పూజ గదిలో ఉంచండి.
- హనుమాన్కు అభిషేకం చేయండి.
- హనుమాన్కు ఎర్రని చందనం, కుంకుమ, పువ్వులు మరియు పండ్లు సమర్పించండి.
- హనుమాన్కు హనుమాన్ చాలీసా పఠించండి.
హనుమాన్ పూజ యొక్క ప్రయోజనాలు
- హనుమాన్ పూజ మీకు శక్తి, ధైర్యం మరియు విజయాన్ని ఇస్తుంది.
- మీ కోరికలన్నీ నెరవేరతాయి.
- మీరు మీ జీవితంలోని అన్ని ఆటంకాలను అధిగమిస్తారు.
- మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటారు.
మీరు మీ జీవితంలో శక్తి, ధైర్యం మరియు విజయాన్ని పొందాలనుకుంటే, మంగళవారం హనుమాన్ పూజను చేయండి. ఈ పూజ మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది.
తిరుమల. శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేసిన ఆలయ అర్చకులు, అధికారులు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ది చేశాం. ఏడాదికి నాలుగు పర్యాయాలు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. వివిధ సుగంధ పరిమళాలు కలిగిన ఈ లెపనం తో ఆలయ గోడలను శుద్ది చెయ్యడం జరిగింది. తద్వారా ఆలయ గోడలకు ఎలాంటి ముప్పు ఉండదు. వేలాది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాం.
ఈరోజు సుబ్రమణ్య షష్టి సందర్భంగా విసన్నపేట లోవెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పసుపులేటి సౌజన్య స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించినారు. మరియు షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి, స్వామివారికి పాలకావిడలు, పొంగలి సమర్పించి వేలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ నరసింహారావు, శ్రీనివాసరావు, రామవరపు దుర్గాప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ మహోత్సవంలోగంధం కిషోర్, అత్తునూరి సతీష్ మొత్తం ఎనిమిది మంది దంపతులు మరియు తదితరులు కల్యాణంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయ సిబ్బంది దేవాలయానికి పూలతో ప్రత్యేక అలంకరణ చేసారు. షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయ నుంది. మార్చి మాసానికి సంబంధించిన దర్శన, సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం భక్తులకు అవకాశం లభిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని టీటీడీ తెలిపింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదలవుతాయి. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. దాతల దర్శనం, గదుల కోటా వెలువరిస్తారు. 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.