Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home National తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్

తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్

by Satya
Suspension of 92 MPs

పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇంత మంది సస్పెండ్ కాలేదు. ఉభయ సభల్లో కలిపి ఏకంగా 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం పార్లమెంటును కుదిపివేస్తోంది. కాగా, గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ రికార్డును తిరగరాస్తూ మోదీ హయాంలో ఏకంగా 92 మంది ఓకేసారి సస్పెండ్ అయ్యారు. సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు. లోక్‭సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీల సస్పెండ్ అయ్యారు. గత గురువారం 13 మంది లోక్‭సభ నుంచి, రాజ్యసభ నుంచి ఒక ఎంపీ సస్పెండ్ అయ్యారు. కాగా, సస్పెన్షన్ నేపథ్యంలో ఉభయసభలు నేటికి వాయిదా పడ్డాయి.

Advertisements

You may also like

Our Visitor

039691
Total views : 199237

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: