భక్తుల కానుకలు, ముడుపులతో టిటిడి ఖజనా నింపుకుంటున్న పాలక మండలి నిర్ణయం సరైనది కాదు అన్నారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల్ని తిరుపతి అభివృద్ధి కోసం మున్సిపాలిటీ మళ్ళించడంను వ్యతిరేకిస్తున్నాం.. ఈ నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తూ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నాం.. టిటిడి నిధుల్లో ఒక్కశాతం అంటే, ఏడాదికి యాభై కోట్లు, శానిటరీ పేరుతో మరో యాభై కోట్లు దారి మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం టిటిడి నిధులను తిరుపతి మున్సిపాలిటీ మళ్ళించడం లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం.. స్వార్ధ రాజకీయాలు,స్వార్ధ ప్రయోజనాల కోసం ఎవరినో దృష్టిలో పెట్టుకుని టిటిడి నిధులను దారి మళ్ళించేందుకు ప్రయత్నించారు.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే శ్రీవారి భక్తుల ఆగ్రహంకు గురి కాక తప్పదన్నారు భానుప్రకాష్ రెడ్డి.
Category:
Devotional
పశ్చిమగోదావరి జిల్లాలో మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 56వ శరన్నవరాత్రి ఉత్సవాలు
by Rama
written by Rama
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం త్యాగరాజు భవనంలో మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 56వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనలక్ష్మి దేవి అలంకరణ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కోటి 98 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రంలోని పలువు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలన్నారు.
Older Posts



Total views : 212211