Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

by Satya
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. వైసీపీ ఐదేళ్లలో కరకట్టలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పదేపదే హెచ్చరించినా వైసీపీ పాలకులు కరకట్టలను పట్టించుకోలేదన్నారు. ప్రజలు, అధికారులు, నాయకులు అహోరాత్రులు శ్రమించి కరకట్టను కాపాడుకొని పెను విపత్తును తప్పించారని ప్రశంసించారు. విపత్తు వేల దాతల సహాయం ఆదర్శనీయమన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పునర్ నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. రామచంద్రాపురం, అవనిగడ్డల్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది. మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో కృష్ణానది కరకట్టపై జనసేన పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కృష్ణానది వరదల ముంపు బారిన పడిన గ్రామాల్లో ప్రజలు కట్టుబట్టలతో మిగిలారని ఎమ్మెల్యే మండలి ఆవేదన వ్యక్తం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: