Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh భ‌క్తులంద‌రికీ వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు – టీటీడీ ఛైర్మ‌న్

భ‌క్తులంద‌రికీ వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు – టీటీడీ ఛైర్మ‌న్

by Satya
Bhumana Karunakara Reddy

వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం సందర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారిని భ‌క్తులు సంతృప్తిక‌రంగా ద‌ర్శ‌నం చేసుకున్నార‌న్నారు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా విస్తృత ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. భ‌క్తులంద‌రికీ వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఉదయం 5.15 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని తెలిపారు టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి. ఆ త‌రువాత స్లాట్ల వారీగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. క్యూలైన్ల‌లో ఉన్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, టీ, కాఫీ, పాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌జావుగా జ‌రుగుతోంద‌న్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: