Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Latest News వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

by Rama
వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దింతో రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దింతో తాళ్ళపాయి గ్రామస్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. వర్షాకాలం వచ్చిందంటే పాములేరు వాగు పొంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ఆ ప్రాంత ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములకలపల్లి నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనులు ప్రారంభించటానికి ముందు వాహన రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలిక రాహదారి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కాని కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితం ప్రస్తుతం వున్న బ్రిడ్జి ను కూలగొట్టి తూతూ మంత్రంగా తాత్కాలిక అప్రోచ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు చాల సార్లు కొట్టుకుపోగ శనివారం రాత్రి కురిసిన చిన్న పాటి వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయి రహదారి పరిధిలోని రింగు రెడ్డి పల్లి, తాళ్ళపాయ, మంగళిగుట్ట, సుందర్ నగర్ సుమారు 20 గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనులు చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న అధికారులు కనీసం పట్టించుకోవడమేలేదని గ్రామస్థులు నిరసన చేస్తున్నారు.ఎంత మంది ఎమ్మెల్యే లు మరీనా తమ ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో ఉంటున్న ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు దారి లేక రెండు రోజులుగా పస్తులుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పదించి వంతెన పనులు వేగవంతం చేయాలనీ 20గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
    ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
  • నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.
    నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
  • నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
    నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: