Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

by Rama
వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దింతో రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దింతో తాళ్ళపాయి గ్రామస్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. వర్షాకాలం వచ్చిందంటే పాములేరు వాగు పొంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ఆ ప్రాంత ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములకలపల్లి నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనులు ప్రారంభించటానికి ముందు వాహన రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలిక రాహదారి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కాని కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితం ప్రస్తుతం వున్న బ్రిడ్జి ను కూలగొట్టి తూతూ మంత్రంగా తాత్కాలిక అప్రోచ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు చాల సార్లు కొట్టుకుపోగ శనివారం రాత్రి కురిసిన చిన్న పాటి వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయి రహదారి పరిధిలోని రింగు రెడ్డి పల్లి, తాళ్ళపాయ, మంగళిగుట్ట, సుందర్ నగర్ సుమారు 20 గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనులు చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న అధికారులు కనీసం పట్టించుకోవడమేలేదని గ్రామస్థులు నిరసన చేస్తున్నారు.ఎంత మంది ఎమ్మెల్యే లు మరీనా తమ ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో ఉంటున్న ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు దారి లేక రెండు రోజులుగా పస్తులుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పదించి వంతెన పనులు వేగవంతం చేయాలనీ 20గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019538
Total views : 91021

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.