Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News మిర్యాలగూడలో బత్తుల లక్ష్మా రెడ్డికి ప్రజలు జన నీరాజనం..

మిర్యాలగూడలో బత్తుల లక్ష్మా రెడ్డికి ప్రజలు జన నీరాజనం..

by Prakash
laxmareddy congress

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజునాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో ప్రచారం నిర్వహించగా కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే మంజునాథ్ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి ప్రజలు జన నీరాజనం పలుకుతూ కాంగ్రెస్ అంటేనే బిఎల్ఆర్, బిఎల్ఆర్ అంటే కాంగ్రెస్ అనే విధంగా ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే కచ్చితంగా గెలుస్తామని ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకి ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలంగాణలో ఆరు పథకాలను ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే అమలు చేస్తుందని అన్నారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: