చిత్తూరు జిల్లాలో 2015లో జరిగిన మేయర్ దంపతుల హత్య కేసులో ఆరు నెలల క్రితం నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వ ఉద్యోగులు సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారు. వీరిలో 8 మంది వివిధ కారణాలు చూపుతూ సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకోగా, మరో 6 మంది తమ సాక్ష్యాన్ని మార్చినట్లు కోర్టు గమనించింది. సాక్ష్యం చెప్పని ఆ 14 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. నోటీసులకు సమాధానాలు సమర్పించినప్పటికీ, వారి వివరణలతో కోర్టు సంతృప్తి చెందలేదు. దాంతో ఆ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, సాక్ష్యాన్ని నిరాకరించడం మార్చడం వంటి చర్యలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ 14 మంది అధికారులపై ప్రైవేటు కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.
చిత్తూరు జిల్లా మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష..
30
previous post



Total views : 33571