Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Telangana ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా- జూపల్లి కృష్ణారావు

ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా- జూపల్లి కృష్ణారావు

by Prakash
jupalli krishna rao

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ విజయోత్సవ ర్యాలీలో ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ కు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అడుగడుగునా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథం పై మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.కొల్లాపూర్ పట్టణంలో దారి పొడవున ప్రజలు మంత్రి జూపల్లి కృష్ణారావు పై పూల వర్షం కురిపించారు.పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు కొల్లాపూర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లాపూర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడించారు.కొల్లాపూర్ ను అన్ని రంగాలలో తన శక్తి వంచన లేకుండా తన చేతనైనంత పని చేస్తానాని నా వంతు కృషి చేస్తానాని హామీనిచ్చారు.నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కొల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తానాని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

008630
Total views : 56993

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.