కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. వికరాబాద్ సభలో కేసీఆర్ భట్టి పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత వీఆర్వో వ్యవస్థను తీసుకువస్తామని భట్టి చెబుతున్నారన్నారు. వీఆర్వో వ్యవస్థ వచ్చిందంటే తెలంగాణ భూములన్నీ మాయం అవుతాయని అన్నారు. అవినీతికి ఊతం ఇచ్చేందుకు భట్టి మళ్లీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీఆర్వో లు అంటేనే లంచాలమయం అని అన్నారు. ధరణి తీసేస్తే భూముల రిజిస్ర్టేషన్ లో పారదర్శకత లోపిస్తుందన్నారు.