Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం…

అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం…

by CVR NEWS
అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం

భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో అత్తమామలు మౌనంగా ఉంటే వారిపై వరకట్న వేధింపుల కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైతికంగా ఆ ప్రవర్తన తప్పు కావచ్చు కానీ, దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భర్త కుటుంబ సభ్యులందరినీ గుడ్డిగా కేసుల్లోకి లాగడం సరికాదని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. భర్తకు మద్దతు ఇచ్చారనో, గొడవల్లో జోక్యం చేసుకోలేదనో లేదా సర్దుకుపోవాలని సలహా ఇచ్చారనో చెప్పి కుటుంబ సభ్యులపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేమని కోర్టు స్పష్టం చేసింది. నేరంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదా నిర్దిష్టమైన పాత్ర ఉంటే తప్ప కేవలం సాధారణ ఆరోపణలతో అత్తమామలను దోషులుగా నిలబెట్టలేమని ధర్మాసనం వివరించింది.

మధ్యప్రదేశ్‌లోని గుణా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. సదరు మహిళ తన అత్తమామలపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది. విఫలమైన వివాహ బంధంలో మహిళ పడే వేదనను తక్కువ చేసి చూడలేమని చెబుతూనే ఇలాంటి వైవాహిక వివాదాల కేసులను విచారించేటప్పుడు కింది కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆరోపణలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించింది. వైవాహిక వివాదాల్లో తీవ్రమైన భావోద్వేగాలు, వ్యక్తిగత కక్షలు దాగి ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమయాల్లో కేవలం భర్తపైనే కాకుండా, గొడవలతో ఎలాంటి సంబంధం లేని అతని కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించే ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులుగా చేర్చిన వారు నిజంగానే క్రూరత్వానికి పాల్పడ్డారా? లేదా? అదనపు కట్నం కోసం వేధించారా అనేదానికి పక్కా ఆధారాలు ఉండటం చట్టప్రకారం ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019238
Total views : 90138

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.