Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National పవన్ కల్యాణ్ కు డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ..

పవన్ కల్యాణ్ కు డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ..

by Satya
Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గతంలో పవన్ చేసిన సామాజిక సేవలకు గాను ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెలలో జరిగే తమ 14వ స్నాతకోత్సవానికి హాజరై, డాక్టరేట్ అందుకోవాలని వర్సిటీ వర్గాలు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాయి. అయితే, వేల్స్ యూనివర్సిటీ ఆహ్వానాన్ని పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించడం సంతోషం కలిగించే అంశమే అయినా, తనకంటే గొప్పవారు చాలామంది ఉన్నారని, అలాంటివాళ్లను గుర్తించి వారికి డాక్టరేట్ ఇవ్వడం సబబుగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాశారు. అంతేకాదు, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని, యూనివర్సిటీ స్నాతకోత్సవానికి తాను హాజరుకాలేకపోతున్నానని లేఖలో తెలిపారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013930
Total views : 78479

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.