తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్ను కాసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం 35 మంది అభ్యర్థులకు ఈ లిస్టులో చోటు దక్కింది. అయితే ఈ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్లో కృష్ణా యాదవ్కు చోటు దక్కింది. ఇక బీజేపీ ముఖ్య నేతలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. లక్ష్మణ్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు థర్డ్ లిస్ట్ లో చోటు దక్కలేదు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మూడో జాబితాలో చోటు దక్కలేదు. తొలి రెండు జాబితాల్లో 53 మంది, థర్డ్ లిస్ట్ లో 35 మంది కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది.
Political
టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ అని, పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామన్నారు. పొత్తుల్లో కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాలే కాదు, దేశ ప్రయోజనాలు కూడా చూస్తామని తెలిపారు. నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్…ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు లేనిదే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లో కాలేరు వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది సందర్భంగా ఎమ్మెల్యే ఖాదర్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ నమోదు చేస్తుందని వారు తెలిపారు మరోసారి అంబర్పేట్ లో గులాబీ జెండా ఎగరవేస్తామని కాలేరు వెంకటేష్ దిమా వ్యక్తం చేశారు.
కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండు లిస్ట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా జాబితాలో40కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇందులో నిన్న చేరిన వారిలో ఇద్దరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో జనసేనకు 9 నుంచి 11సీట్లు కేటాయించే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు దృష్టిలో ఉంచుకుని మరికొన్ని స్థానాలను పెండింగ్లో ఉంచనుంది. కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో బీజేపీ టికెట్ ఆవావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో అని ఆశావహుల్లో సస్పెన్స్ నెలకొంది.
తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 12 నియోజకవర్గాలలో జనసేన పొటీ చేయనున్నది. 9 నియోజకవర్గాలపై అవగాహన కుదిరింది. మరో 3 నియోజకవర్గాలపై చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కూకట్ పల్లి ,శేరిలింగంపల్లి , వైరా, ఖమ్మం, అశ్వరావుపేట , కొత్తగూడెం, కోదాడ,నాగర్ కర్నూల్ , తాండూర్ నియోజకవర్గాలను బీజేపీ కేటాయించింది.
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తెలుగు వారందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రం గా ఆంధ్ర రాష్ట్రం గా ఉండాలని ఆ నాడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అలాగే ముద్దాయిగా బయటకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ వారు సంబరాలు జరుపుకోవటం ఎంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని కాకుండా ఆరోగ్య సమస్య ఉన్న కారణంగా షరతుల పై మద్యంతర బేయిల్ మాత్రమే ఇచ్చారని అది తెలుగు దేశం పార్టీ వారు తెలుసుకోవాలని అన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి వెళ్ళనున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ కి మాజీ మంత్రి దేవినేని ఉమా, గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో భారీగా మోహరించిన పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు.
వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ దిగిన పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణనికి చెందిన వైసీపీ ఎస్సి నేత కోట.ఆంజనేయులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2011 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుక తిరిగి , పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తనకి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. దాచేపల్లి పట్టణంలోని ఎస్సి కాలనిలో వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ దీక్షలో కూర్చున్న ఆంజనేయులు మరియు అతని కుటుంబ సభ్యులు.
బందరు రోడ్డు వైపు కాన్వాయ్ మళ్లించిన పోలీసులు తెల్లవారుజామున 4.45గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ కు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే మహిళల్లో పెల్లుబికిన ఆనందం, హారతులు పడుతూ నీరాజనాలు చేసారు . ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దే అనూరాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు స్వాగతం పలికారు. కారులోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ బాబు ముందుకు సాగారు.
Read Also..
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడుతున్న ప్రజలు. రాత్రి 11.30గంటల ప్రాంతంలోనూ జాతీయరహదారిపై వేచిచూస్తున్న మహిళలు, అభిమానులు. రాజమండ్రి నుంచి 7గంటలకు పైగా సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రయాణం. భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై గంటకు 20కిలోమీటర్లు కూడా సాగని కాన్వాయ్. వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అదుపుచేయలేక ఆపసోపాలు పడుతున్న పోలీసులు.




Total views : 92183