విస్సన్నపేట బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 52 రోజుల తర్వాత రిమాండ్ నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవటంతో , తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు మిఠాయిలు, బాణాసంచా కాల్చారు కమ్మటూరు రామాలయం సెంటర్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు విడుదలైన సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు, పంచి సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాబా శ్రీను, మర్రిబోయిన చిన్నోడు, రాయల సుబ్బారావు, ఆకుల రాధా, రామినేని రామారావు, జనసేన పార్టీ నాయకులు, అడపా శ్రీను,కిషోర్, వెంకటేశ్వరరావు, యాసిన్, నాదెండ్ల నాగమణి, వాణి, కార్యకర్తలు వృద్ధులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమ్మటూరు మొత్తం పండుగ వాతావరణ నెలకొన్నది.
Political
టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో బెయిల్ లభించడంపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ జై బాబు జై జై బాబు నిజం గెలిచింది న్యాయం గెలిచిందంటూ కేరింతల కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నరసాపురం ఇన్చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్రంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు. ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడారు. తొలుత పంచాయతీ బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బహిరంగ సభ చేరుకున్నారు. సభలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ప్రతిపక్షాలు అడ్డొచ్చినా ముందుకు సాగుతామన్నారు. ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు సభ మధ్యలేనే వెళ్లిపోవటంతో సభ వెలవెలబోయింది.
భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడం, కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందింది. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చిన నిజం గెలవాలి – కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా…లుగుదేశం పార్టీ కార్యాలయం బయట నిజం గెలవాలి న్యాయం జరగాలి అంటూ న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. వినూత్న రీతిలో మోకాళ్ళ పైన నిలపడి న్యాయదేవత కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమయిందని, న్యాయాన్ని బ్రతికించి దుష్ట శిక్షణకు శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమయిందని వేడుకున్నారు. అన్యాయం శిక్షింపబడాలని ఈ కార్యక్రమంలో న్యాయదేవతగా జిల్లా తెలుగుమహిళా అధికార ప్రతినిధి పేరం అనిత కుమారి, తెలుగు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కొత్తూరి వెంకట్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మేళం సైదయ్య, తెలుగుయువత విద్యార్థి నేతలు మహిళలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. దొడ్డిపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మండల సర్వేయర్ పైన ఒత్తిడి తెచ్చారు. సర్వేయర్ రెడ్డప్ప ఈ భూమి కోర్టులో ఉన్నందువల్ల సర్టిఫికెట్ ఇవ్వలేనన్నారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ కార్యాలయానికి వచ్చి నాయకులు కంభం అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. దీంతో సర్వేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ సమాధి అవుతారని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. తన వ్యాఖ్యలు టీడీపీ వాళ్లకు తప్పుగా అనిపిస్తున్నాయని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… “2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ వాళ్లకు అలా అనిపించి ఉండొచ్చని తెలిపారు. చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుగా ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 51 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు. బ్లాక్ డ్రెస్లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైల్లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా బ్లాక్ డ్రెస్లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఐటీ ఉద్యోగులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ సభను ఏర్పాటు చేశారు. సాయంత్ర 4గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధిచి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. దాదాపు లక్ష మందిపైగా ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడం వల్లే వచ్చాయని టెక్కీలు తెలిపారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నాయకులను వెంటబెట్టుకుని నిన్న ఉదయం శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై విరుచుకు పడ్డారు. ఈ తరుణంలో పోలీసులు 26 మంది పై ఆరు రకాల సెక్షన్లో కేసులు బనాయించారు.




Total views : 92164