వ్యక్తి గత మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన షేర్ చేసే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పి కృష్ణ రావు ఇపిఎస్ .అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఎస్పి కార్యాలయంలో వారు రాజంపేట డిఎస్పి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుల్లంపేట మండలం వత్తులురు గ్రామానికి చెందిన చింతా సుదర్శన్ పై క్రైమ్ నెంబర్ .309 /203 U/S 153(A),505 IPC కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఇతను భి ఫార్మసి పట్టుభద్రుడని తెలంగాణ రాష్త్రం హైదరాబాద్ లో కొన్ని ఫార్మా కంపెనీలలో ఉద్యోగం చేస్తు జీవనం సాగించే వారు. ఇతను అనారోగ్యం కారణంగా గత ఏడాది నుంచి రాజంపేటలో నివాసం ఉంటున్నట్లు మా విచారణలో తేలిందన్నారు. ఆరు నెలల క్రితం ఒక టిడిపి అనుచరుడితో పరిచయం ఏర్పరచుకొన్నారు. అతని ద్వారా వాట్సప్ గ్రూప్ నందు మెంబర్ గా చేరాడు. నిందుతుడు ప్రతి రోజు కుడా సుమారు 150 సభ్యులకు అసబ్యకరమైన పోస్టులను షేర్ చేస్తుండేవాడు. అందుకోసం అతనికి ప్రతి నేలా ఎనిమిది వేల రూపాయలు జీతం చెల్లించే వారు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరిని కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా. నకిలీ ఖాతాలు, మారుపేర్లతో పోస్టులు పెట్టేవారిని గుర్తించే సాంకేతికత తమ దగ్గర ఉందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీల, అవమానకర పోస్టులపై యుద్ధం ప్రకటించామని.. అలాంటి పోస్టులు పెట్టేవారిపై గతంలో కంటే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీపై అభిమానంతో భవిష్యత్తును పాడు చేసుకోవద్దని వారు హితవు పలికారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..
221
previous post





Total views : 79569