ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల మేర టోకరా వేశారు. వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ వీసా మోసం వెలుగులోకి వచ్చింది. కన్సల్టెన్సీ నిర్వాహకులతో పాటు నటి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tag:




Total views : 92309