బాపట్ల పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్న తరుణంలో, అంగన్వాడీ శిబిరంలో ఒక అంగన్వాడీ కార్యకర్త కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే తేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు సపర్యాలు చేసి దగ్గర్లోని హాస్పటల్ కు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ఆకలి కేకలతో మేము రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నా.. ఆరోజు పాదయాత్రలో మా తలలు నిమిరి, చెంపలు నిమిరిన ముఖ్యమంత్రికి మా బాధలు కనపడట్లేదా, మా ప్రాణాలు పోయే వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించరేమోనని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.
Tag:





Total views : 78578