తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకుని, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టిటిడి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసిందని కొనియాడారు. దర్శనం అనంతరం సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… టిటిడి చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కంపార్ట్మెంట్లో కాసేపు వేచి ఉండే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి కావలసిన పాలు, నీరు, ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు ఇస్తున్న టీటీడీ యాజమాన్యాన్ని అభినందించారు. భక్తులకు ఇలాంటి దర్శన భాగ్యం కలిగిస్తున్న కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు ఆ దేవదేవుడు మరింత శక్తి నివ్వాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించానని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు.
టీటీడీ
కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన మీడియాకు వెల్లడించారు.ముడిసరుకుల నిల్వకు అలిపిరి వద్ద రూ. 11 కోట్లతో గోడౌన ను నిర్మించనున్నట్లు తెలిపారు. మంగళం-రేణిగుంట రోడ్డుకు రూ. 15 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.పుదిపట్ల జంక్షన్-వకుళామాత గుడి వరకు రోడ్డుకు రూ. 21 కోట్లు కేటాయించామన్నారు.ఆయుర్వేద ఆసుపత్రిలో రూ. 1.65 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రుయాలో టీబీ రోగులకు రూ. 1.79 కోట్లతో కొత్త వార్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రూ. 197 కోట్లతో స్విమ్స్ నవీకరణ పనులు చేపడతామన్నారు. టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. దీనికి కోసం మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నామని భూమన వెల్లడించారు.




Total views : 79577