ఇరాన్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పతనం అంచున ఉన్నట్లు ఇరాన్ తమకు తెలియజేసిందన్నారు. వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని తమను కోరినట్లు ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు. ఇరాన్ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు. అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే, ఇరాన్ నుంచి ఈ విషయాన్ని ఎవరు చెప్పారనే వివరాలు ట్రంప్ వెల్లడించలేదు. సంభాషణ నేరుగా జరిగిందా? లేక మధ్యవర్తి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారా? అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై వైట్హౌస్ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Tag:
#డొనాల్డ్ట్రంప్ #అమెరికా #ఇరాన్ #అంతర్జాతీయరాజకీయాలు #ఉద్రిక్తతలు #విదేశాంగపాలసీ #ప్రపంచభద్రత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన,యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని సృష్టం చేసిన ట్రంప్..
by CVR NEWS
written by CVR NEWS
ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించే ఉద్దేశం తనకు లేదని వైట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఎందుకు వాడాలి..? సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లోనే మేము వారిని ఎదుర్కొంటున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని తెలిపారు.అదే సమయంలో టెహ్రాన్తో ఒప్పందంపై హెచ్చరికలు జారీ చేస్తూ.. సమయం మించిపోతోందని అన్నారు. అయితే త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక, స్థిరమైన ఒప్పందంపైనే తమ దృష్టి ఉందని పేర్కొన్నారు.





Total views : 62177