తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ.. రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఓల్డ్సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు సైతం కట్టరన్నారు. ఓల్డ్సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని.. అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు.
బీజేపీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు. హంగ్కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు. 2018లోనూ ఇలాగే చేశారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా.. ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత సానుభూతి తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో బీజేపీ కి బిగ్ షాక్త గిలింది. మానకొండూర్ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జీ గడ్డం నాగరాజు త్వరలో గులాబీ గూటికీ చేరానున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజెపి ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన నాగరాజుకు ఈసారి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత 30 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్ట పడిన తనను కాదని కొత్తగా చేరిన అరేపల్లి మోహన్ కి టికెట్ కేటాయించడం పట్ల గడ్డం నాగరాజు గులాబీ గూటికీ చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ.జీవి. రామకృష్ణారావు నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. త్వరలో భారీ సంఖ్యలో తమ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే బంగారు కుటుంబం మాత్రం అయిందని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు మళ్లీ కేసీఆర్కు అమ్ముడుపోవడం ఖాయమన్నారు. బీజేపీ గెలిస్తే గ్రామపంచాయతీ నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి లేకుండా చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్స్ జాతీయ రహదారిని, ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే ముఖ్యమంత్రి వస్తారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్లోనే పుట్టారని, ఆ పార్టీలో పని చేశారని, ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో అమిత్షా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ.. రాహుల్ను ప్రధానిని చేయాలని చూస్తుంటే. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ను సీఎంను చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు.కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలన్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని అమిత్ షా తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు. భూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని. ఓట్ల కోసం వచ్చే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలను తరిమి కొట్టాలని లేఖలో పేర్కొన్నారు. హరితహారం పేరుతో పోడు బూముల్లో మొక్కలు నాటి రైతుల భూములను లాక్కుంటున్నారని రాశారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో బ్రాహ్మనీయ, హిందుత్వ మతోన్మాదం పేరుతో.. దళితులపై, మైనారిటీలపై దాడులు చేస్తున్నారని మావోయిస్టులు లేఖలో వివరించారు.
డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.





Total views : 90527