కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని మిగిలిన వాటిని ప్రజాపాలన ద్వారా వినతులను తీసుకొని అర్హులందరికీ వంద రోజుల్లో అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆరో వార్డు సిలార్ పల్లిలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం అని అన్నారు. అనంతరం కౌన్సిలర్ విజయలక్ష్మి ఆమె కుమారుడు సతీష్ సమకూర్చిన అమ్మ అన్నపూర్ణ కార్డులను పంపిణీ చేసి ఆ కార్డు ద్వారా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. విద్యార్థినీలకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, చింతల రమణా రెడ్డి, కౌన్సిలర్ ఎజాజ్ శ్రీధర్ రెడ్డి, బాలు నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్, భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సిఎం, డిప్యూటీ సిఎంలు కలవనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో పాటు ఇతర ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని మోదీని… రేవంత్, భట్టి కోరే అవకాశముంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమలు కావాల్సిన హామీలు, ఐటిఐఆర్ ప్రాజెక్ట్ పై మోదీతో… రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించనున్నారు.