ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు 26.12.23 మంగళవారం ఉదయం 11 గంటలకు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాo ఆంధ్ర అనే కార్యక్రమం మంచి స్ఫూర్తితో కూడిన క్రీడాకారులకు మంచి నైపుణ్యం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. మనం ఈ బిజీ కాలంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటామని, అలాంటి టైంలో ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందచ్చని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రాష్ట్రవ్యాప్తంగా గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి ఒక్క క్రీడాకారుడు, విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ముఖ్య మంత్రి ఆలోచన ధోరణికి అద్ధం పడుతుందని, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు లాప్టాప్లు సెల్ ఫోన్లతో బిజీ లైఫ్ లో ఉన్నారని గమనించి శారీరకంగా అందరూ కష్టపడితే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని స్కూలు, కాలేజీ విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పురపాలక సంఘంలో కార్మికులకు దుస్తులు, నిత్యవసరాలను పంపిణీ చేశారు.
అనంతరం పట్టణంలోని వినాయక సర్కిల్లో కేక్ కోసి వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే సతీమణి, అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు కాపు భారతి, కుమారుడు కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ పోరాల్లు శిల్ప, మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.




Total views : 78288