నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024, 2026 సంవత్సరాల పరిస్థితులను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేపదే పేపర్ లీక్లు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు.
నీట్ పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నా విద్యా మంత్రి రాజీనామా చేయలేదని విమర్శించారు. మళ్లీ సీబీఐ విచారణ, మరో కమిటీ ఏర్పాటవుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి దేశం తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. మిస్టర్ మోదీ, దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. వాటికి సమాధానం చెప్పండి… అంటూ మూడు సూటి ప్రశ్నలను లేవనెత్తారు.
పదేపదే పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి?, పేపర్ లీక్లపై చర్చ విషయంలో మీరెందుకు మౌనంగా ఉంటున్నారు?, పదేపదే విఫలమవుతున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదు? సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వరుస పేపర్ లీక్ల పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి తగదంటూ ఆయన హితవు పలికారు.
#రాహుల్గాంధీ #కాంగ్రెస్ #నోయిడా #యూపీ #కార్మికులఆందోళన #కార్మికహక్కులు #భారతరాజకీయాలు #ప్రజాసమస్యలు #ఆందోళనలు #రాజకీయమద్దతు
యూపీలోని నోయిడా కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. కార్మికులు కోరుకున్నది కేవలం 20వేల వేతనం.. వారిది దురాశ కాదు.. హక్కు అని రాహుల్ అన్నారు. కార్మికులు సంపాదించింది సగం అద్దెలకే పోతుంది.. సంవత్సరానికి మూడు వందలు జీతం పెంచే లోపే.. వారి ఇంటి యజమాని రూ. 500 వందలు అద్దె పెంచేస్తున్నారు. కార్మికులు బతికేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని నోయిడా కార్మికులు ఆందోళనపై సోషల్ మీడియా X ద్వారా స్పందించారు రాహుల్ గాంధీ. కార్మికులు 20వేల జీతం మాత్రమే కోరుకుంటున్నారు. అది దురాశ కాదు.. వారి హక్కు అని రాహుల్ రాశారు. నోయిడా కార్మికులు ఎన్నోమార్లు నిరసనలు తెలిపి అలసిపోయి తుది నిర్ణయంగా ఆందోళనకు దిగారని అన్నారు రాహుల్ గాంధీ. నోయిడాలో ఒక కార్మికుడు నెల రూ. 12వేలు సాంపాదిస్తుండగా.. ఇంటి అద్దె రూ. 4వేలనుంచి 7 వేల వరకు చెల్లిస్తున్నాడు. వారికి సంవత్సరాని జీతం 300 పెంచితే.. ఇంటి యజమాని అద్దెను ఏడాదికి రూ. 500 పెంచుతాడు అని రాహుల్ అన్నారు.
ఇప్పటికే అదుపులేని ద్రవ్యోల్బణం జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ప్రజలను అప్పుల ఊబీలో ముంచేస్తోంది.. ఇదే అభివృద్ది భారత దేశం వాస్తవ పరిస్థితి అంటూ ప్రశ్నించారు. అమెరికా సుంకాల యుద్ధాలు, ప్రపంచ ద్రవ్యోల్బణం, కుప్పకూలుతున్న సరఫరా వ్యవస్థ.. ఈ భారం మోదీజీ స్నేహితులైన పారిశ్రామికవేత్తలపై పడలేదు. రోజువారీ కూలీపైనే అత్యంత తీవ్రమైన దెబ్బ పడింది. ఏ యుద్ధంలోనూ భాగం కాని, ఏ విధానాన్నీ రూపొందించని కేవలం పనిచేసిన కార్మికుడిపైనే భారం పడుతోంది. శాంతియుతంగా తమ హక్కులను డిమాండ్ చేసినందుకు ప్రతిఫలంగా వారిని అణచివేస్తున్నారని రాహుల్ అన్నారు. ఎటువంటి సంప్రదింపులు లేకుండా తొందరపాటుతో, మోదీ ప్రభుత్వం 4 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇవి పని గంటలను 12 గంటలకు పెంచుతున్నాయి. తమ పిల్లల స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేస్తూ, రోజుకు 12 గంటలూ నిలబడే ఆ కార్మికుడి డిమాండ్ అసంబద్ధమైనదా? మరి ప్రతిరోజూ వారి హక్కులను కాలరాస్తున్నది – ఇదేనా అభివృద్ది అంటే అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.




Total views : 80124