శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెదేపా జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డిలా ఆర్టీసీ బస్సులు పెట్టి మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చి తెచ్చిన ప్రజలు కారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన, నాయకత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శనం నిన్న విజయవంతం అయిన రా కదలి రా సభ అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు, వైసీపీ దౌర్జన్యాలకు క్రీడారంగం కూడా గురైందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి క్రీడాకారులకు నాసిరకం క్రీడా వస్తువులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఆంధ్ర క్రికెట్ జట్టులో 17వ ఆటగాడి కోసం వైసీపీ నాయకుల ప్రోత్బలంతో జట్టు నాయకుడు, భారత జట్టు టెస్ట్ ఆటగాడు హనుమ విహారిణి ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడం దారుణమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలను నాశనం చేశాడని పేర్కొన్నారు.
Tag: