ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని.. దీంతోనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ హై స్కూల్ మైదానం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్, జేసి ఫర్హాన్ అహమ్మద్, ఇండియన్ వాలి బాల్ క్రీడా కారిణి, ఆడుదాం ఆంధ్ర జిల్లా అంబాసిడర్ వసుమతిలు హాజరయ్యరు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదం ఆంధ్రా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలియపరిచారు. అనంతరం జిల్లా అంబాసిడర్ వసుమతి కలెక్టర్ ఎమ్మెల్యేలకు క్రీడా జ్యోతిని అందజేశారు. అనంతరం జాతీయ జెండా ను ఆవిస్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి బెలూన్లతో పాటు పావురాలను ఎగుర వేసి క్రీడలను ప్రారంబించారు. కబడ్డీ, కో-కో, వాలి బాల్ క్రీడలకు ఏర్పాటు చేసిన మైదానం ను వారు పరిశీలించారు. అనంతరం వాలి బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో సరదాగా కాసేపు వాలి బాల్ ఆడారు. ఎమ్మెల్యే, కలెక్టర్, జేసి, జిల్లా అంబాసిడర్ లు కాసేపు వాలి బాల్ క్రీడలను ప్రత్యేక్షంగా చూసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాబై వేలకు పైగా ఆడుదాం ఆంధ్రా లలో ఆడేందుకు క్రీడాకారులు రిజిస్టర్ చేసుకోన్నారన్నారు. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తిసుకువచ్చ్చారన్నారు. యువత మన రాయచోటి నుండి ఐపిఎల్ తో పాటు జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయిన తర్వాత క్రీడా మైదానం కు 27 ఎకరాలు స్థలాన్ని కేటాయించడమే కాకుండా త్వరితగతిన అన్ని రకాల వసతులతో క్రికెట్ స్టేడియాన్ని పూర్తీ చేసినందుకు కలెక్టర్ గిరిషా పీఎస్ కు ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆ స్టేడియంలో జాతీయ స్థాయి టోర్నమెంట్ లు జరిగేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడలను యువత, విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మన జిల్లా కు మంచి పేరు ప్రఖ్యాతలు తేవలాని మనస్పూర్తిగా కోరుకొంటున్నట్లు ఈ సందర్బంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో రంగ స్వామి, మున్సిపల్ కమీషనర్ గంగ ప్రసాద్, రెవెన్యు అధికారులు, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, వైకాప నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Adudham andhra
మార్కాపురం గడియార స్తంభం సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నజాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎస్పి వీరరాఘవ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. స్థానిక గడియారం వద్ద నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో మున్సిపల్, పంచాయితీ, సచివాలయ అధికారులు, వాలింటర్లు పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తున్న “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంబించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడుకు సిఎం చేరుకుంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సిఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోటీలు మొదలవుతాయి. డిసెంబర్ 26 నుంచి 2024 ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజులపాటు ఐదుదశల్లో ఈ పోటీలు జరుగుతాయి. సిఎం జగన్ పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Read Also..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరు లో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లని వారు తొలగించారు. స్టేడియం లో విద్యార్థుల కి మెరుగైన వసతులు ,సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితి ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.





Total views : 79118