విజయవాడ బాపు మ్యూజియంలో లెడ్జెర్ షో, సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్కే.రోజా పాల్గొన్న షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ అబ్బుర ఇతర పురావస్తు ప్రదర్శనశాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ ఈ మ్యూజియం ప్రాంగణంలో లైట్ అండ్ సౌండ్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్ ను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. బాపు మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందిన కట్టడం. నేటి తరానికి చరిత్రను తెలియజేసేందుకు టెక్నాలజీని జోడించాం, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చిన్నారులకు తెలియజేసేందుకు లైట్ అండ్ సౌండ్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. నేను మంత్రి అయిన తర్వాత భవానీ ఐ ల్యాండ్ ను అభివృద్ధి చేశానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
Tag:
Ambedkar
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, సీజేఐ చంద్రచూడ్ మొక్కలు నాటారు. పలువురు అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు పాల్గొన్నారు. 2015 నుంచి 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నారు.






Total views : 78739