విజయవాడ, అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం తో జరిగిన చర్చలు పై సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సమ్మె విరమిస్తున్నాం, రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం. జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు. మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపు చేస్తాం అన్నారు. సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అని వెల్లడించారు.
Anganwadi strike
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కరించాలని వినూత్న రీతిలో మట్టిని తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మొద్దు నిద్రలో ఉందన్నారు, ఇప్పటికైనా మా సమస్యల పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు. లేకపోతే రోజు కూడా ఇలానే మట్టిని తింటూ మేము మా సమస్యల పరిష్కరించేంత వరకు కూడా పోరాడుతామని అన్నారు. పెనుకొండకు వచ్చిన శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పట్టించుకోకుండా ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు.
ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ.. అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఇప్పటికైనా వైయస్ జగన్ తమ సమస్యలను తెలుసుకొని తాము పడుతున్న బాధలను, కష్టాలను గమనించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also..
గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని, ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు.
బాపట్లలో అంగన్వాడీలు రోడ్డుపై 18 వ రోజు అని అక్షరాల రూపంలో రోడ్డుపై కూర్చొని అంగన్వాడీలు వినూతన నిరసన తెలిపారు. మాట తప్పిన సీఎం డౌన్ డౌన్, మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు, మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని హోరెత్తించిన అంగన్వాడీలు బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు మొదట పది గంటలకు జగన్మోహన్ రెడ్డికి వినిపించేలా చిటికెలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 18 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
Read Also..
అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్ళను అంగన్వాడీలు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఏలూరులోని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటిని అంగన్వాడి మహిళలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్లను ఏర్పాటు చేసి అంగన్వాడీ మహిళలను అడ్డుకున్నారు. గత 16 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలపై సమ్మె చేపట్టిన కనీసం ప్రభుత్వం స్పందించలేదని. రెండుసార్లు చర్చిలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ మహిళలకు అనేక హామీలు ఇచ్చారని నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 15వ రోజు అంగన్వాడీలు శ్రీకాకుళం నగరంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. 7 రోడ్ల కూడలి వద్ద ప్లేట్లు, గరిటలు పట్టుకొని మోత మోగిస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ నిద్రాహారాలు మాని అనేక విధాలుగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకరిని విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా కనీస వేతనం 26000 ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాచ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Read Also..
తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి వర్కర్స్ & హేల్పర్స్ యునియన్ అద్వర్యంలో తలపెట్టిన అంగన్ వాడి నిరవధిక సమ్మె 14 వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం చాల బాధకరం అన్నారు. అంగన్ వాడి నాయకురాలు మసృన్ బీ, చిన్నమండెం మండలం కార్యదర్శి ఉమా రాణి. 14 వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డివో కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు సమాన పనికి సమాన వేతనం 26 వేల వేతనాన్ని అందజేయలన్నారు. అదే విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన మహిళల పట్ల వైసిపి నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అంగన్ వాడి తాళాలు పగల గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తమను తాము సమర్దించు కోవడం చాల సిగ్గు చేటన్నారు. నెల నెలకు అందని వేతనాలతో, చాలీ చాలని వేతనాలతో, అంగన్ వాడి కేంద్రాల అద్దెలు చెల్లించుకోలేక, కూరగాయలు, గ్యాస్, టి ఎ డి ఎ బిల్లులు రాకపోవడంతో అంగన్ వాడిలు ఆర్దికంగా అనేక దుర్బర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల రానున్న రోజుల్లో అంగన్ వాడి మహిళల శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి వర్కర్లు హేల్పర్లు పాల్గొన్నారు.
Read Also..
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన సమ్మె శుక్రవారం 11 రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, నిర్మలమ్మ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో అంగన్వాడి టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతానని మాట ఇచ్చి మాట తప్పారని జగన్ సర్కార్ పై అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని జగన్ సర్కార్ కు హెచ్చరించారు. రోడ్డుపై భిటాయించి ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం తీసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
Read Also..
లక్ష పైచిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం.. అంగన్వాడీలను విమర్శ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి.. జగన్మోహన్రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నాము.. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేస్తుంటే పార్టీల రంగు పులమటం ఎంత వరకో మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం.. గౌరవ వేతనం కోసం మా పోరాటం కాదు.. కనీస వేతనంమే మా డిమాండ్.. మాటలు చెప్పే ఆలోచనలు వద్దు, ఆచరణలో చూపండి. నాడు మీరు చెప్పిన మాటలకు కట్టుబడమనేదే మా విజ్ఞప్తి.. మాటలు జారే ముందు మీ నాయకుడు చేసిన వాగ్దానంపై ప్రశ్నించండి.. బాపట్లలో 11వ రోజు దీక్ష ఐసిడిఎస్ ప్రాజెక్టు నుండి ర్యాలీగా బయలుదేరి, బాపట్ల పాత బస్టాండ్ లో మానవహారం గా ఏర్పడి రోడ్డుపై నిరసన తెలిపిన అంగన్వాడీలు.. బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. న్యాయమైన సమస్యలపై మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము.. ఈ సందర్భంగా అంగన్వాడీలకు పోలీసులకు తోపులాట జరిగింది. కాసేపు బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం అంగన్వాడీలు ధర్నా విరమించి ఐసిడిఎస్ ప్రాజెక్టు బయలుదేరి వెళ్లారు.