ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన. 25న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పి ఈ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. 3.30 నుంచి 5 గంటల వరకు పి ఈ ఎస్ ఆడిటోరియంలో చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి 26 ఉదయం గంటపాటు చిత్తూరు జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మద్యలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కుప్పం బూత్ లెవెల్ కమిటీ నుంచి పై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు కుప్పం మెడికల్ కళాశాల నుంచి సీఎం చంద్రబాబునాయుడు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61450