ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన. 25న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పి ఈ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. 3.30 నుంచి 5 గంటల వరకు పి ఈ ఎస్ ఆడిటోరియంలో చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి 26 ఉదయం గంటపాటు చిత్తూరు జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మద్యలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కుప్పం బూత్ లెవెల్ కమిటీ నుంచి పై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు కుప్పం మెడికల్ కళాశాల నుంచి సీఎం చంద్రబాబునాయుడు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
- ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర నియామకం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా…
- ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలుఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 47756