ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన. 25న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పి ఈ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. 3.30 నుంచి 5 గంటల వరకు పి ఈ ఎస్ ఆడిటోరియంలో చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి 26 ఉదయం గంటపాటు చిత్తూరు జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మద్యలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కుప్పం బూత్ లెవెల్ కమిటీ నుంచి పై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు కుప్పం మెడికల్ కళాశాల నుంచి సీఎం చంద్రబాబునాయుడు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 91133