ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులతో వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా టిడిపి సానుభూతి పరులైన 600 మందిపై కేసులు పెట్టారని పరోక్షంగా 2000 మందికి పైగా పరారీలో ఉన్నారు అని వైకాపా అక్రమ కేసులతో వ్యవసాయాన్ని నమ్ముకున్న అమాయకులు ఉపాధి కోల్పోయారు అని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పాడిపరిశ్రమ, హార్టికల్చర్ జీవనాధారంగా బ్రతికే అమాయకుల పై అక్రమ కేసులతో వీరంతా పరారీలో ఉన్నారు అన్నారు. టిడిపి నేతలు, టిడిపి సానుభూతి పరులను అక్రమ కేసులు పెట్టడం కన్నా అందరిని ఒకేసారి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్సీ వర్గాలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించడం మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలోనే చూస్తున్నాం అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ ఉన్మాద ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. రాబోవు రోజులలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారు అన్నారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు.
#ap #tdp
ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరమని ఎగతాళి చేసి మేము అధికారంలోకి వస్తే మోటర్లు పీకేస్తామని ప్రహబ్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కృష్ణ డెల్టాకు సాగునీరు అందుతుందంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనిని ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులను ఎగతాళి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో బెయిల్ లభించడంపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ జై బాబు జై జై బాబు నిజం గెలిచింది న్యాయం గెలిచిందంటూ కేరింతల కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నరసాపురం ఇన్చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్రంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు సంతోషంలో మునిగిపోయారు. రాజమండ్రి, హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ హోరెత్తిస్తున్నారు. అన్నమయ్య జిల్లా టిటిడి మాజీ పాలకవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగువాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.
శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నాయకులను వెంటబెట్టుకుని నిన్న ఉదయం శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై విరుచుకు పడ్డారు. ఈ తరుణంలో పోలీసులు 26 మంది పై ఆరు రకాల సెక్షన్లో కేసులు బనాయించారు.
చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ తమ పార్టీ నేతలకు కానీ బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.
గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నారా భువనేశ్వరికి అండగా చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు. యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో, పోలీసులకి టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేసి, ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
వైసీపీ వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును 49 రోజులుగా జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా, అమరావతి రాజధాని నిర్మించడం తప్పా, పోలవరం కట్టడం తప్పా. ఆయన చేసిన నేరం ఏమిటి? అని భువనేశ్వరి ప్రశ్నించారు.