శ్రీవారి అనుగ్రహంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగళవారం ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ, 15 రోజుల క్రితం తిరుమల, తిరుపతిలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నదని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబరు 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల, తిరుపతిలలో ప్రారంభమైన వర్షాలు, గత రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుండి నీటిని విడుదల చేస్తారన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.
Bhumana Karunakara Reddy
తిరుపతి అభివృద్దే మా ఆశయంగా ముందుకు సాగుతామని, ప్రజాభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బార్ లే అవుట్ జంక్షన్ మీదుగా నూతనంగ నిర్మించిన భూపిరాట్టి రహదారిని ఆదివారం టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన జీయంగార్ స్వాముల చేతుల మీదుగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, ముద్రనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యుల వారి తల్లి గారైన భూపిరాట్టి పేరు మీదుగా ఈ నూతన రహదారికి పేరు పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్దికై పాటుపడుతున్న తామపై ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయమని, దేశంలోనే తిరుపతి ఖ్యాతిని మరింత విస్తరించేందుకు శ్రమిస్తునే వుంటామన్నారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ ఇరువురు మాట్లాడుతూ 116 లక్షలతో తిలక్ రోడ్డు నుండి తాతయ్యగుంట గంగమ్మ గుడి వైపుగా జబ్బార్ లే అవుట్ జంక్షన్ వరకు నిర్మించిన భూపిరాట్టి నూతన రహదారిని ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి ప్రజల సౌకర్యార్ధం మరిన్ని అభివృద్ది పనులు త్వరలో చేపట్టడం, ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజల అభివృద్దే ప్రధాన అజేండగా ముందుకు వెలుతున్నామని, అభివృద్దిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ది చెబుతారని, తమ కౌన్సిల్ మొత్తం నగరాభివృద్దికై నిరంతరం పాటుపడుతూనే వుంటుందన్నారు.





Total views : 91209