కడప జిల్లా… జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి అభ్యర్థి మరియు కడప తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి (Bhupesh Reddy) ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నెమల్లదిన్నె గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ….. ప్రస్తుతం రాజోలి జలాశయం ముంపు గ్రామమైన నెమల్లదిన్నె గ్రామంలో తాను, భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజోలి జలాశయ ముంపు వాసుల కష్టాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాజోలి జలాశయం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ జలాశయం ప్రకటన రావడంతో ఇక్కడి ప్రజలకు తమ స్థలాలను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందని దీంతో అవసరాలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజోలి ముప్పు గ్రామాలకు ఎకరా 24 లక్షలు ఇస్తామన్నారు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకున్నాడని, అందుకే ఆయనను తాను జరోన గా అభివర్ణిస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని అన్నారు. కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై వివేకానంద రెడ్డిని చంపడంలో ఆయన పాత్ర ఉందని సొంత చెల్లెలు ఆరోపిస్తున్నారని తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అగ్రిగోల్డ్ బాధితులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబుతో మాట్లాడి న్యాయం చేస్తామని అగ్రిగోల్డ్ బాధితులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. టౌన్ బ్యాంక్ బాధితులకు కూడా న్యాయం చేస్తామన్నారు. తన వియ్యంకుడు కేశవరెడ్డి గురించి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆయన ఆస్తులు ప్రభుత్వానికి అటాచ్ చేసి ప్రతి ఒక్కరికి అప్పు తీర్చడం జరుగుతుందని ఈ విషయంపై తాను చాలా కసరత్తులు చేశానని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…





Total views : 194415