పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ఎమ్మార్వో ఆఫీస్ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బిజెపి నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాక పోవడంతో ఆసుపత్రి నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థల సేకరణ చేసి, ఆస్పత్రి నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రామగుండం తహసిల్దార్ కుమారస్వామి కి వినతి పత్రం అందజేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట..ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…
- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
- మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్కు చెందిన శివాజీ రాథోడ్ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్సర్లోని కామధేను…
- బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా? మీ ఇంట్లో.. అల్మారాల్లో.. లాకర్లలో పేరుకుపోతున్న బంగారం, ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా..? అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్? సామాన్యుడికి…
- చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 78454