పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ఎమ్మార్వో ఆఫీస్ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బిజెపి నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాక పోవడంతో ఆసుపత్రి నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థల సేకరణ చేసి, ఆస్పత్రి నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రామగుండం తహసిల్దార్ కుమారస్వామి కి వినతి పత్రం అందజేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి