పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ఎమ్మార్వో ఆఫీస్ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బిజెపి నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాక పోవడంతో ఆసుపత్రి నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థల సేకరణ చేసి, ఆస్పత్రి నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రామగుండం తహసిల్దార్ కుమారస్వామి కి వినతి పత్రం అందజేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భోజ్శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…
- యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో…
- పంజాబ్ కింగ్స్కు వరుసగా ఐదో షాక్.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తోంది. వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన వారు చాలా కాలంగా 13 పాయింట్లకే పరిమితమై ఉన్నారు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే మరియు ఆర్ఆర్ కూడా వారికి దగ్గరగా వచ్చేశాయి. మరోసారి బౌలర్లే జట్టును నిరాశపరిచారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 77975