దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి. తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి. ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ – బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. దీంతో మరోసారి 71 వేల మార్కు అధిగమించినట్లయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ – నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది. 215 పాయింట్ల లాభంతో 21,453 వద్ద నిఫ్టీ పరుగు చాలించింది. బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు, ఫైనాన్స్ నిఫ్టీ 67 పాయింట్లు పైకి ఎగశాయి. నిఫ్టీలో హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొ, హెచ్.సి.ఎల్ షేర్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ లో ఐ.ఎఫ్.సి.ఐ, బాంబే డయింగ్, హెచ్ఎఫ్సీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, మిశ్రధాతు నిగమ్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి.
Tag:
Bombay Stock Exchange – BSE Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. ప్రారంభం నుంచి సూచీలన్నీ పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ -బీఎస్ఈ సెన్సెక్స్ అయితే ఏకంగా 600 పాయింట్లకుపైగా నష్టంలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ 170 పాయింట్లకుపైగా కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 720 పాయింట్లకుపైగా కోల్పోయింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలన్నీ నష్టాల్లోనే సాగుతున్నాయి. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకుపైగా మదుపరుల సంపద హారతి కర్పూరమై ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. నష్టాల భయంతో అమ్మకాలు పెరిగాయి.






Total views : 78647