నంద్యాల(Nandyala)లో టీడీపీ(TDP)కీ భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల మాజీ ఎమ్మల్యే భూమా బ్రహ్మానందరెడ్డి(Bhuma Brahmananda Reddy) నామినేషన్(Nomination) వేయాలంటూ అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అభిమానులతో చర్చించిన బ్రహ్మానందరెడ్డి తన వర్గానికి ఇంచార్జ్, బూత్ కన్వీనర్ పదవులు ఇవ్వాలని ఫరూక్ ను కోరారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన నల్లారి సోదరులు..
అయితే ఫరూక్ స్పందించక పోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు బ్రహ్మానందరెడ్డి. అధిష్టానం కలిసి పనిచేయాలని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఒకవేళ భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేస్తే టీడీపీ పరాజయం పాలవుతుందంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. 23, 24 తేదీల్లో నామినేషన్ వేసేందుకు భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
- మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212641