మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు.
కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గా అతని వద్ద ఐడి కార్డు లభించింది..
కారులో ఉన్న రెండు బ్యాగులను తీసుకొని మరికొందరు వ్యక్తులు పారిపోయినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. స్థానిక పోలీసులు ప్లేయింగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేయగా అందులో 500,200 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. పోచారం మున్సిపాలిటీ, ఘట్ కేసర్ ప్రాంతాలకు తరలిస్తుంన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు కారు అడ్డగించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డబ్బులు తరలింపు వ్యవహారం వెనకాల మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చేస్తూ చెంగిచెర్ల క్రాస్ హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. కారు వద్దకి చేరుకున్న రిటర్నింగ్ అధికారి. డబ్బు స్వాదీనం చేసుకున్నారు.
brs party
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు. ఇన్ని రోజులు రాని బాల్క సుమన్ ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని రైతులు నిలదీశారు. 52 సర్వే నెంబర్ లో భూములు అన్యాక్రాంతం అవుతున్నా బాల్క సుమన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ గో బ్యాక్ అని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నిరసన తెలుపుతున్న రైతులను సముదాయించి వెళ్లగొట్టిన పోలీసులు. బాల్క సుమన్ బాయ్ బాయ్ మా ఊరికి రావద్దు. మా ఓట్లు నీకు వేయము అంటు గ్రామస్తులు చెప్పారు.
కొద్దిగా ఆలస్యం అయ్యింది ఎం అనుకోవద్దు. నన్ను మన్నించాలి. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ఒక్కటే అడుగుతున్న ఎల్లారెడ్డి పేట కు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన్న లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎల్లారెడ్డి పేట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎల్లారెడ్డి పేట ఎలా ఉంది చూడండి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎరువుల కోసం ఎల్లయ్య అనే రైతు లైన్ లో నిలబడి చనిపోయాడు. ఇక్కడ రోడ్డు పై ఉన్న షాప్ వాళ్ళను అడగండి ఎప్పుడు ఇన్వర్టర్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ల రొచ్చు మాటలు వినే పరిస్థతి లేదు. దేశంలో ఎవరు రైతు బందు ఇవ్వలేదు, మన కెసిఆర్ రైతు బందు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు లేదు అని అని అంటున్నాడు, ఒక్కసారి ఎల్లారెడ్డి పేట మండలంలో ఏ ఊరికి వచ్చిన 24 గంటల కరెంటు చూపిస్తా. ఎల్లారెడ్డి పేట లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ స్కూల్స్ బాగు చేస్తాం. కాంగ్రెస్ అనేది దున్నపోతు నమ్మి మోసపోవద్దు పాలిచ్చే బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వారానికి రెండుసార్లు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాను. మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ మాటల నమ్మకండి, బిఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలి. మీ కడుపులో పుట్టిన బిడ్డగా అనుకొని ఆశీర్వదించి మల్లొకసారి గెలిపించాలి. 30వ తేదీన ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మరోసారి కల్వకుంట్ల కవిత పై ఫైర్ అయ్యారు. నన్ను చెప్పు తో కొట్టడం కాదు, మీ అయ్యాను స్తంబానికి కట్టి మీ అన్న ని చెప్పు తో కొడుతా అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మహిళాలాగా బ్రతకడం నేర్చుకో అని, లేకుంటే నువ్వు మహిళావి అని మేము కూడా మరచిపోతాం అని అన్నాడు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. భువనగిరి ఖిల్లను చూస్తే చాలా భాద అనిపించింది. కోటను 25కోట్లతో అభివృద్ధి చేస్తాం. తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తే మూసి ప్రక్షాళన చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలే బాగుచేయలి. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. భూదాన్ పోచంపల్లిలో వినోదాభావే భూదాన్ ఉద్యమం చేస్తే ఇప్పుడు కేసీఆర్ భూ కబ్జా ఉద్యమం చేస్తున్నారు. కెసిఆర్ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల భూములను కబ్జా చేశాడు. బిజెపి అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపి జైల్లో పెడతాం. తెలంగాణలో బిఆర్ఎస్ కు విఆర్ఎస్ కాలేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో కెసిఆర్ ఎన్నడు మోడీని కలవలేదు. కేసీఆర్ అబద్దాలను చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కెసిఆర్ కు వేసినట్టే. 2014 ,2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో చేరారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ, మద్యం కుంభకోణాల్లో, ఓ ఆర్ ఆర్ కుంభకోణం, మిషన్ కాకతీయ, కాలేశ్వరం లాంటి కుంభకోణాలు చేశాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం. బిజెపి ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణను నెంబర్ వన్ గా చేస్తాం.
తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది. అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి 7,700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు, రెండు కాదు… ఏకంగా 7,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం, కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది. ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
మరో రెండు రోజులు ప్రచార సమయం ముగిస్తున్న సందర్భంలో అభ్యర్థులు పోట పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డీ ప్రచారం జోరుగ కొనసాగుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా132 డివిజన్ జీడిమెట్ల విలేజ్,మీనాక్షిఎస్టేట్, అంగడిపేట, పలు కాలనీలలో రోడ్డు షో ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోలన్ హన్మంత్ రెడ్డీ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దీమవ్యక్తం చేశారు ఇందిరమ్మ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ పాలన వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు చేర్చే విధంగా కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. గడిచిన పది సంవత్సరాలనుండి BRS పార్టీ చేసింది ఏమిలేదన్నారు. జరగబోయే ఎన్నికలలో BRS పార్టీ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కోలన్ హన్మంత్ రెడ్డీ అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రైతులకు రైతుబంధు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. శనివారం నాడు రావిర్యాల, మోహబ్బత్ నగర్, కే. సి. తండా, మహేశ్వరం, తుక్కు గూడ జరిగిన రోడ్ షో లలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని పేర్కొంటూ రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నా, కేవలం మూడు గంటలు రైతులకు చాలని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీకి తగదని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే రైతులు 10 ఎచ్ పి మోటార్లు బిగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని, అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని బీజేపీ సర్కారు ఒత్తిడి చేసిందని మేము చెబుతుంటే లేదు లేదు తమ ప్రభుత్వం ఆ మాటే అనలేదని తెలంగాణ బీజేపీ నేతలు అదరగొట్టిండ్రని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు. పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో నిలపాలని ప్రజల్ని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలను కూడా తప్పని సరిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసిఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మంత్రి హరీష్ రావు సతిమని శ్రీనిత పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంచలంచలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయని ఆమె తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు కు మద్దతుగా పలు వార్డులలో హరీష్ రావు సతీమణి తిరిగి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచార సందర్భంగా పట్టణంలో హరీష్ రావు సతీమణికి భారీ స్పందన లభించింది.
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి సేవకుడు చింత ప్రభాకర్ కి మా మద్దతుతని జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ఏ సిద్దేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు శివచంద్ర పాటిల్ అన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం తరఫున శనివారం విలేకరుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వీరశైవ లింగాయత్ అభివృద్ధి కోసం చింత ప్రభాకర్ పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి 50 లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని ఎడ్ల బజార్ బసవేశ్వర కళ్యాణ మండపానికి 40 లక్షల రూపాలు రావడానికి కృషి చేసిన చింత ప్రభాకర్ కే మా ఓటు అని తీర్మానం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర వీర సేవా సమాజం భవనం కోసం కోక పేటలో కోట్ల విలువ చేసే ఎకరం స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా సమాజ భవనం కోసం కంది మండలంలో సుమారు ఐదు కోట్ల విలువ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షినియమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవులందరూ చింత ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేయాలని సమాజం తరఫున పిలుపునిచ్చారు. సమావేశంలో సమాజం జిల్లా కోశాధికారి చంద్ర కాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పపల్లి నర్సింలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్, జిల్లా నాయకులు మల్లికార్జున్ గందిగేరాజు శాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.