బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత… తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
మొత్తంగా సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, సాగునీటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన సమస్యలను అధిగమించి, పెండింగ్ పనులను పూర్తి చేసి ….రైతులకు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.




Total views : 212579