నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మరి జనార్దన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని అందుకే ప్రజల తరఫునుంచి కారు గుర్తుకే ఓటేస్తామని తనను మూడోసారి గెలిపిస్తామని ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బ్యాలెట్ లో మూడో నెంబర్ గుర్తుపై నొక్కి తనను గెలిపించాలని బ్యాలెట్ నమూనాను ఓటర్లకు చూపిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. తన ప్రచారంలో ప్రజలు ఇస్తున్న మద్దతుకు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Tag:
Car joru
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం, కాక్కులుర్, కేసారం, సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ ఎన్నికల్లో అయనకు ఉన్నా ప్రత్యర్థులను విమర్శిస్తూ వారి పై ఉన్న కేసుల గురుంచి చెప్తు వారికీ ఓటు వేస్తే అభివృధి అనేది కుంటు పడుతుందని ఈ సంద్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి పట్నం అవినాశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగరావు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Read Also..





Total views : 91040