హైదరాబాద్ లోని హయత్ నగర్ నేతాజీ నగర్ లో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సంజయ్ అకస్మాత్తుగా మిస్సయ్యాడు. మధ్యాహ్నం 3గంటలకు ఇంటి నుండి వెళ్లిన విద్యార్థి సాయి సంజయ్ తిరిగి రాలేదు. హోమ్ వర్క్ చేయలేదని సంజయ్ తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన సాయి సంజయ్ రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.
CC cameras
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి లో మంచాల్ మండల గ్రామాలలో సుమారు 136 సిసి కెమెరాలు ప్రధానమైన చోట్ల పెట్టడం జరిగింది. మంచాల్ మండల పోలీస్ స్టేషన్ లో రాచకొండ సి పి, సుధీర్ బాబు సిసి కెమెరాలను ఆవిష్కరించడం జరిగింది. సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో సిసి కెమెరాలు తీసుకురావడం చాలా అభినందనీయం. ప్రజా ప్రతినిధులను అధికారులను అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన సిసి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకోవడం సులభంగా ఉంటుందని వివరించారు. నేరాలు చేసే వారికి కట్టిన శిక్షలు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ ద్వారా యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున అధికంగ చెడిపోవడానికి కారణాలు అవుతాయి. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు యువతకు విద్యార్థులకు ప్రతి ఒక్కరు వారికి సరైన సలహాలు సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.. కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు, డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసిపి శ్రీనివాస్, సీఐ కాశీ విశ్వనాథ్.. స్థానిక ప్రజాప్రతినిధులు, స్టూడెంట్ పలువురు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఫైనాన్స్ కంపెనీల్లో దొంగతనాలకు ప్రయత్నిస్తున్న ఓ దుండగుడును పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు చేరుకుని దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిసిఎస్ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని సంఘటనలు జరిగిన తీరును పరిశీలించారు. ఐదో తారీకు అర్ధరాత్రి ముత్తూట్ ఫైనాన్స్ చోరీకి ప్రయత్నించిన దుండగుడు, ఎనిమిదో తారీకు అర్ధరాత్రి ఫైనాన్స్ కంపెనీలో చోరీకి ప్రయత్నించిన దుండగుడు, రెండు చోట్ల చోరీకి ప్రయత్నించిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్న పోలీసులు, రెండు ఫైనాన్స్ కంపెనీల వద్ద స్థానిక పోలీసులతో కలిసి వివరాలు సేకరిస్తున్న ఏలూరు సిసిఎస్ పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని లాడ్జిలలో చెక్ చేస్తున్న నూజివీడు పట్టణ పోలీసులు, రెండు నేరాలలో ఒకే వ్యక్తి పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి. మురళి కృష్ణ టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల వద్ద, ఫైనాన్స్ కంపెనీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ నియమించుకోవాలని, నష్టం జరిగాక ఇబ్బంది పడే దానికన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి.మురళీకృష్ణ సూచించారు.
Read Also…
Read Also….
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదానికి ముందు ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం వద్ద సంచరించినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
రాజేంద్రనగర్లో సన్సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో శనివారం వేకువజామున భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్జోన్కూ మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మరో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం నాలుగు దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also..
Read Also..




Total views : 78384