పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యబలి పూజ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువులపాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విచారణ గురువులు జోసెఫ్ బాలసాగర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శణీయమన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని అన్నారు. క్రీస్తు సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు.
Chritmas celebrations
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తన బూట్లను అటెండర్ తో మోయించారు. జిల్లా కేంద్రంలోని ఓ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి షూలతో ప్రవేశించిన కలెక్టర్.. ఆ వెంటనే తన షూలను విప్పి పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. కలెక్టర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలి వచ్చారు. అక్కడ ఉన్నవారు ఈ ఘటనను సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 2015 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ భవేశ్ మిశ్రా ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఉట్నూర్లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్గా కూడా పనిచేశారు. కాగా, అటెండర్ తో బూట్లు మోయించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అయినా, అటెండర్ అయినా అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, తోటి ఉద్యోగిని ఇలా కించపరచడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు.
Read Also..




Total views : 79796