Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaWarangal జయశంకర్ భూపాలపల్లిలో విస్మయకర ఘటన

జయశంకర్ భూపాలపల్లిలో విస్మయకర ఘటన

by Rama
collector

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తన బూట్లను అటెండర్ తో మోయించారు. జిల్లా కేంద్రంలోని ఓ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి షూలతో ప్రవేశించిన కలెక్టర్.. ఆ వెంటనే తన షూలను విప్పి పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. కలెక్టర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలి వచ్చారు. అక్కడ ఉన్నవారు ఈ ఘటనను సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 2015 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ భవేశ్ మిశ్రా ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా, అటెండర్ తో బూట్లు మోయించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అయినా, అటెండర్ అయినా అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, తోటి ఉద్యోగిని ఇలా కించపరచడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014306
Total views : 79844

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.