నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ పెరిగింది సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలువులు రావడంతో శ్రీశైలం ఆలయానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షి గణపతి ఆలయం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్….
346
previous post





Total views : 196661